అక్కినేని నాగార్జున ఫార్మ్ హౌస్ లో మృతదేహం

 

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన వ్యవసాయ భూమిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ శివార్లలోని షాద్‌నగర్ మండలం పాపిరెడ్డిగూడెం గ్రామంలో నాగార్జునకు 40 ఎకరాల స్థలం ఉంది. నాగార్జున సతీమణి అమల అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యడానికి కృషి చేస్తున్నారు. కాగా, బుధవారం కొంతమందిని వ్యవసాయ పనుల నిమిత్తం అక్కడకి పంపించారు. అయితే వాళ్ళకి అక్కడ ఓ పాడుబడ్డ గదిలో ఒక వ్యక్తి శవం కనిపించింది. వెంటనే వారు కేశంపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేశ్వరులు తన బృందంతో అక్కడకి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి, అస్తిపంజరంగా మారడంతో.. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి.. మృతుడు ఎవరో గుర్తించే పనిలో పడ్డారు. ఇక్కడే హత్య జరిగిందా? లేదా ఎక్కడన్నా హత్య చేసి ఇక్కడ వదిలిపెట్టారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.