TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 ఢిల్లీలో ఫిబ్రవరి ఐదో తేదీన ఒకే దశ  పోలింగ్ 

Published on: Tue Jan 7, 2025 2:09PM

కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ గడువు  ఈ ఫిబ్రవరి 23తో ముగియనుంది. మొత్తం 70  మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు ఆప్ అధికారంలో వచ్చింది. 2015 లో  67 స్థానాలు, 2022లో 62 స్థానాలతో  ఆప్ అధికారంలో రాగలిగింది. వరుసగా పదిహేనేళ్లు అధికారంలో ఉన్న  కాంగ్రెస్ గత ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయింది. 
ఫిబ్రవరి ఐదో తేదీన ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎనిమిదో తేదీన కౌంటింగ్ ఉంటుంది.  ఈ విషయాన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం వెల్లడించారు.