TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శుభ్ మన్ గిల్ కెప్టెన్స్ ఇన్నింగ్స్.. కేకేఆర్ పై జీటీ గెలుపు

Published on: Sat Apr 18, 2026 6:34AM

ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 17) జరిగిన ఉత్కంఠ పోరులో  గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. . కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్స్ నాక్ కారణంగానే గుజరాత్ టైటాన్స్ మరో  రెండు బంతులు మిగిలి ఉండగానే  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.   

టాస్ గెలిచి తొలుత  బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు.  అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్  55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును  ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు  రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్  సహకారాన్ని అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 180 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ   3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్  2 వికెట్లు తీశారు. 

ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ (22) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ ఆరంభం నుంచే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జోస్ బట్లర్ (25) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు. గిల్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువగా తీసుకువెళ్లాడు. అయితే గిల్ ఔట్ అయిన తరువాత గుజరాత్ టైటాన్స్ కు పరుగులు రావడం కష్టంగా మారింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. చివరకు 10.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.