శివాజీ పై బీజేపీ కార్యకర్తల దాడి...

 

నటుడు శివాజీ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో పలు ప్రాంతాల్లో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో శివాజీ కూడా ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే ఈ చర్చలో శివాజీ ప్రసంగిస్తుండగా... బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చి ఆయనపై దాడి చేశారు.  ప్రత్యేక హోదాపై బీజేపీ అనుసరిస్తున్న తీరును శివాజీ తప్పుబట్టి మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... "మోదీ జీరో... మోదీ జీరో" అంటూ శివాజీ నినాదాలు చేశారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు "శివాజీ డౌన్ డౌన్" అని నినాదాలు చేశారు. దీనికి గాను శివాజీ ఆగ్రహంతో ప్రజలు మిమ్మల్ని ఇంకా మాట్లాడనిస్తున్నారు. ఇంకా ఇదే పరిస్థితి ఉంటే తరిమి కొడతారని హెచ్చరించారు. ఆపై బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా శివాజీపై దాడి చేశారు.