2000 కి.మీ. మైలురాయి దాటిన షర్మిల పాదయాత్ర

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ షర్మిల ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో రావికంపాడు గ్రామం వద్ద తన పాదయాత్రలో 2000 కి.మీ. మైలురాయిని దాటారు. దేశంలో ఇంతదూరం ఏకదాటిగా నడిచిన మొట్ట మొదటి మహిళగా కూడా ఆమె ఒక సరి కొత్త రికార్డు నెలకొల్పారు. గత ఏడాది అక్టోబర్ 18న కడప జిల్లా ఇడుపులపాయలో మొదలుపెట్టిన తన పాదయాత్రలో ఆమె మోకాలికి గాయం అయినప్పుడు మాత్రమే కేవలం ఒకటిన్నర నెలల పాటు విశ్రాంతి తీసుకొన్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వద్ద తన పాదయాత్రను ముగించాలని నిర్ణయించుకొన్నారు. అంటే ఇంకా మరో మూడు నెలల పాటు ఆమె పాదయత్ర సాగుతుంది. మహిళలు తలచుకొంటే దేనినయినా సాదించగలరని ఆమె నిరూపించి చూపారు. తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆమె పాదయాత్ర స్పూర్తినిస్తుందని ఆశిద్దాము.