కేంద్రంలో ముందస్తు ఎన్నికలు ; పవార్‌

 

తెలంగాణ విషయంలో రోజుకో మాట చెపుతూ అయోమయం కలిగిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మిత్రపక్షనాయకుడైన శరద్‌పవార్‌ షాక్‌ ఇచ్చారు. తెలంగాణ అంశాన్ని కదిలించిన కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలన్న సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ అంశం అంత త్వరగా తేలే విషయం కాదన్నారు పవార్‌.

 

రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం పై అలిగిన కాంగ్రెస్‌ ఎంపిలు ఏ క్షణం అయినా రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు.. సీమాంద్ర నాయకుల రాజీనామాలు స్పీకర్‌ అంగీకరించినట్టయితే ప్రభుత్వం మైనారిటీలో పడి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.

 

అయితే ఎన్నికల ఎప్పుడు వచ్చినా తాము కాంగ్రెస్‌ పార్టీతో కలిసే పోటి చేస్తామన్నారు. అయితే ఈ సారి తాను ప్రత్యక్షరాజకీయాల్లో పోటి చేయదలచుకోలేదని.. వచ్చే ఏడాది రాజ్యసభకు వెళ్లే ఆలోచనలో ఉన్నానని తెలిపారు.