శాంతి ర్యాలి చేయనివ్వకపోతే బంద్‌

 

హైదరాబాద్‌లో ఏపిఎన్జీవోల సభకు అనిమతించడంతొ తెలంగాణ జేఎసి నాయకులు భగ్గుమంటున్నారు. తాము శాంతియుతంగా ర్యాలి చేస్తామన్నా అనుమతి నిరాకరించిన పోలీసులు సమైక్యవాధుల సభకు అనుమితి ఎలా ఇస్తారని ప్రశ్నించారు..

అంతేకాదు తమ ర్యాలికి అనుమతివ్వని పక్షంలో హైదరాబాద్‌ నగరంలో 48 గంటలు లేదా 72 గంటలపాటు బంద్‌ నిర్వహించే ఆలోచనలో ఉంది తెలంగాణ జెఎసి. అయితే 7వతేది కాకుండా మరో రోజు ర్యాలి చేసుకోవాలి పోలీసులు కోరినా అందుకు అంగీకరించని టి జెఎసి అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా ర్యాలి జరిపి తీరుతామన్నారు.

ఒకే రోజుల తెలంగాణ జెఎసి, లాయర్‌ జెఎసి, విద్యార్ది జెఎసి మూడు ర్యాలీలకు అనుమతి కోరడంతో పోలీసులు వారి అభ్యర్ధనను తిరస్కరించారు. దీంతో ఇప్పుడు 7న హైదరాబాద్‌లో ఏంజరుగుతుందో అన్న ఉత్కంట నెలకొంది.