కిరణ్ కో హఠావో కాంగ్రెసుకో బచావో: శంకరరావు
Published on: Fri May 11, 2012 4:00PM
కాంగ్రెసులోని అగ్రకులాల వారు దళితులను పార్టీలో ఎదగకుండా అణగదొక్కుతున్నారని శంకరరావు మండిపడ్డారు.సిఎల్పీలోకి వెళ్లే తన హక్కును కాలరాచినందుకు ముఖ్యమంత్రి పైన, సిఎల్పీ సిబ్బంది పైన తాను స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. తనలాంటి దళితుడిని అడ్డుకున్నందుకు సిఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేను అని, తనకు సిఎల్పీ కార్యాలయానికి వచ్చే హక్కు ఉందన్నారు.
ముఖ్యమంత్రిపై పోలీసులు 24 గంటలలోగా కేసు నమోదు చేయకుంటే తాను మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన చేపడతానని హెచ్చరించారు. కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. కాగా శంకర రావు తన వ్యక్తిగత సిబ్బందితో ముఖ్యమంత్రిపై, సిఎల్పీ కార్యవర్గంపై అట్రాసిటీ కేసు పెడుతున్న లేఖను సైఫాబాద్ పోలీసు స్టేషన్కు పంపించారు. పిఏ ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలను పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఆ తర్వాత ఆయన స్పీకర్ను కలిసి సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశముంది. కిరణ్ కో హఠావో కాంగ్రెసుకో బచావో అన్నారు.


