శంషాబాద్‌లో 4 కిలోల బంగారం పట్టివేత

 

 

 

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నాలుగు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి నుంచిఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవారు రకరకాల మార్గాల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. పాప్‌కార్న్ యంత్రం, లోదుస్తుల్లో, బ్యాగు హ్యాండిల్, బ్యాగుల డిజైనింగ్ తీగలు, సెల్‌ఫోన్ కవర్‌లు.. ఇలా రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కస్టమ్స్ అధికారుల డేగకళ్ళ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దుబాయి, మలేషియా, బ్యాంకాక్, థాయ్‌లాండ్, సింగపూర్, లండన్, అమెరికా దేశాల నుంచి భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది.