సికింద్రాబాద్‌లో సోనియా సభ పెడితే కాంగ్రెస్ గెలిచేదా?

 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన మంగళవారం నాడు గాంధీ భవన్‌లో ‘ఎన్నికల ఫలితాలు - పార్టీ పునర్వ్యవస్థీకరణ’ అనే చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో పలువురు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతోపాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఒక వెరైటీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అది సోనియాగాంధీ వల్లేనని ఆయన అన్నారు. అలాగే సికింద్రాబాద్‌లో సోనియాగాంధఈ సభను నిర్వహించి వుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచేదని ఆయన అన్నారు. సోనియాగాంధీ సికింద్రాబాద్‌లో సభ పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీ గెలవటానికి లింకేంటో అర్థంకాక సభలో వున్నవారు గజిబిజి అయిపోయారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టే ఆలస్యంగా విడుదల చేయడం, మేనిఫెస్టోలో రైతు రుణ మాఫీ పథకాన్ని పెట్టకపోవడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని షబ్బీర్ చెప్పారు.