ముష్టోళ్ళమీద హైకోర్టులో కేసు

 

 

 

తెలంగాణలో ముష్టోళ్ళు ఏడా 140 కోట్ల రూపాయల లావదేవీలు జరుగుతున్నాయని వెల్లడిస్తూ, ఈ ముష్టి వ్యవస్థను రూపు మాపాలని కోరుతూ హైకోర్టులో ఒక న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హైదరాబాదులోనే దాదాపు 11 వేల మంది యాచకులున్నారని సదరు న్యాయవాది డి.వి.రావు తన పిల్‌లో చెప్పారు. తెలంగాణలో చాలా ఇబ్బందికరంగా మారిన భిక్షగాళ్ల వ్యవస్థను రూపమాపాలని ఆయన తన పిటిషన్’లో కోరారు. బిచ్చగాళ్ళని పునరావాస కేంద్రాల్లో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. హోంశాఖ కార్యదర్శిని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆయన తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.