సీమాంధ్ర నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తి

 

 

 

సీమాంధ్రలో నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తి కానుంది. దాంతో రాజకీయ పార్టీలో తమ తుది జాబితాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. సీమాంధ్రలోని అనేకమంది ప్రముఖ నాయకులు ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈరోజు నామినేషన్లకి చివరిరోజు కావడంతో నామినేషన్ల కేంద్రాలు ఈరోజు కిటకిటలాడుతున్నాయి. అలాగే పలు పార్టీలలో ఇప్పటికీ ఎవరికీ కేటాయించని సీట్ల విషయంలో పూర్తి క్లారిటీ రాబోతోంది. నామినేషన్ల ఘట్టం ఈరోజు ముగిస్తే సాయంత్రానికి ఏ స్థానం నుంచి ఏ పార్టీ అభ్యర్థి రంగంలో వున్నాడు. ఏ నియోజకవర్గంలో ఎవరెవరి మధ్య పోటీ జరిగే అవకాశం వుందనేది స్పష్టంగా తెలుస్తుంది.