సీమాంధ్ర ఎంపీలపై వేటు ఖాయం: చాకో

 

 

 

అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆరుగురిపై వేటు తప్పనిసరి అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. పార్టీలో ఉండి సమైక్యాంధ్ర గురించి పోరాడడం కాకుండా ఏకంగా పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలతో కలిసి అవిశ్వాసం పెట్టడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. ఇప్పుడు దేశంలో ఎన్నికలు రావాలని ఏ పార్టీ కోరుకోవడం లేదని, అవిశ్వాసం చర్చకు వచ్చినా వీగిపోతుందని పీసీ చాకో తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడడానికి, సీమాంధ్ర ప్రజల ముందుకు రావడానికి కారణాలు వెతుకుతున్న ఎంపీలు కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర అన్నందుకు తమను వెళ్లగొట్టిందని చెప్పుకుని ఇక రెచ్చిపోనున్నారు.