సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణ

Seemandhra MPs resignations, Seemandhra MPs, congress, tdp, ysrcongress

 

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కాంగ్రెస్, టిడిపి, వైకాపా సీమాంధ్ర ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించారు. రాజీనామలు ఇచ్చిన వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదని, ఆర్టికల్ 101(3బి) ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరపొచ్చని, సమాచార సేకరణ కూడా చేయొచ్చని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. రాజీనామలు చేసిన సీమాంధ్ర ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. గతంలోనే స్పీకర్ మీరాకుమార్‌ను ఎంపీలు ఎస్పీవైరెడ్డి, లగడపాటి, అనంత, మేకపాటి, ఉండవల్లి, సాయిప్రతాప్, సబ్బంహరి,  కలిసిని విషయం తెలిసిందే.