రాజీనామాలను ఆమోదిస్తారని భావిస్తున్నా౦: ఉండవల్లి
posted on Sep 28, 2013 2:29PM
లోక్సభ స్పీకర్మీరాకుమార్తో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఎంపీలు లగడపాటి, సాయిప్రతాప్, అనంత, ఉండవల్లి, ఎస్పీవైరెడ్డి స్పీకర్ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎంపీల అభిప్రాయాలను స్పీకర్ తెలుసుకున్నారు. మనస్పూర్తిగా రాజీనామా చేస్తున్నారా అని స్పీకర్ అడిగినట్లు తెలుస్తోంది. తమపై ఎవరి ఒత్తిడి లేదని స్పీకర్కు దీనిపై సీమాంధ్ర ఎంపీలు తెలిపినట్లు సమాచారం. రాజీనామాలు చేసిన ఎంపీలకు హర్షకుమార్, సబ్బంహరి మద్దతు తెలిపారు.
లోక్సభ స్పీకర్మీరాకుమార్తో సమావేశం అనతరం ఉండవల్లి అరుణకుమార్ మీడియా తో మాట్లాడారు.ఏ రకమైన ఒత్తిడికి గురై ఇచ్చిన రాజీనామా లేఖ కాదని, కావాలని, పూర్తి మనఃపూర్వకంగా ఇచ్చిన రాజీనామా అని స్పష్టంగా చెప్పామని ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. తమ రాజీనామాలను ఆమోదిస్తారని భావిస్తున్నామని అన్నారు. ఇంకేదైనా సందేహం ఉంటే స్పీకర్ ను అడగండని అన్నారు.