ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న కేసీఆర్

సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాలను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబసమేతంగా విచ్చేసిన సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రితో వెంట రాజ్యసభ సభ్యుడు కేకే, మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మారావు ఉన్నారు. సీఎం రాకను పురస్కరించుకుని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.