సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తీవ్ర కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి స్టేషన్లో బాంబు పెట్టామంటూ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు అణువణువు గాలించారు. అయితే ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించికపోవడంతో అది ఫేక్ ఫోన్ కాల్‌గా గుర్తించి..కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా భద్రతా దళాలు, జాగిలాలు ఉరుకులు పరుగులు పెట్టడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.