కశ్మీర్లో రెండోవిడత పోలింగ్!
Published on: Wed Sep 25, 2024 12:52PM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది. రాష్ట్రంలోని 26 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 26 స్థానాలకు గాను 239 మంది అభ్యర్ధుల రంగంలో ఉన్నారు. ఈ విడతలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతల భవిష్యత్ తేలనుంది.


