సత్యం రాజుకు సెబి 1849 కోట్ల షాక్

సత్యం రామలింగరాజుకు సెబి దిమ్మతిరిగే షాకునిచ్చింది. సత్యం కుంభకోణంపై దాదాపు ఐదేళ్ళ విచారణ చేసిన సెబీ, తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడిన రామలింగ రాజు, ఆయన సోదరుడు బీ.రామరాజు (సత్యం-మాజీ మేనేజింగ్ డైరెక్టర్), వదలమని శ్రీనివాస్ (సత్యం మాజీ సి.యఫ్.ఓ.), జీ.రామకృష్ణ (సత్యం-మాజీ వైస్ ప్రెసిడెంట్) మరియు వీ.యస్. ప్రభాకర్ గుప్తా (సత్యం-మాజీ హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్)లకు ఏకంగా రూ. 1849 కోట్ల జరిమానా విదించింది. వారు ఐదుగురు ఆ మొత్తాన్ని కేవలం 45రోజులలో సెబీ ఖాతాలో జామా చేయాలని ఆదేశించింది. అంతే కాక ఆ మొత్తానికి ఈ కుంభకోణం బయటపెట్టిన రోజు నుండి అంటే జనవరి 7, 2009 నుండి నేటి వరకు ఏడాదికి 12శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. వారిని 14 ఏళ్ల పాటు మార్కెట్ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం కూడా విధించింది.