లిబియాలో పడవ మునక.. 170 మంది గల్లంతు...

 

లిబియాలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు రెండు వందల మందితో ప్రయాణిస్తున్న ఓ బోటు మునిగిపోవడంతో 20 మంది మరణించారు. 170 మంది గల్లంతయ్యారు. ట్రిపోలి ప్రాంతంలోని సముద్రంలో ఈ ఘటన జరిగింది. బోటులో వున్నవారందరూ లిబియా నుంచి ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్తున్న శరణార్థులని తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గల్లంతయిన 170 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరందరూ మరణించి వుండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లిబియాలో అనిశ్చిత పరిస్థితులు వుండటంతో చాలామంది దేశం వదలి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్తున్నవారే ఇప్పుడు ప్రమాదానికి గురయ్యారు.