రైలు ఆలస్యమైంది.. అందుకే ఘోరం జరిగింది!

 

మెదక్ జిల్లా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూలు బస్సును రైలు ఢీకొన్న నాందేడ్ పాసింజర్ రైలు నిజానికి ఆ సమాయానికి ఆ ప్రాంతానికి రావలసిన రైలు కాదు. అంతకు నాలుగు గంటల ముందే ఈ క్రాసింగ్ నుంచి రైలు వెళ్ళిపోవలసి వుంది. అయితే గురువారం నాడు ఈ రైలు నాలుగు గంటలు ఆలస్యమైంది. ప్రతిరోజూ అదే మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఉదయం ఎనిమిదిన్నర సమయంలో వచ్చే రైళ్ళు ఏవీ లేవన్న ఉద్దేశంతో భరోసాగా ట్రాక్‌ దాటుతూ వుంటారు. ఆ సమయంలో రైళ్లేవీ రావన్న ధైర్యంతోనే బస్సు డ్రైవర్ కూడా మొండిగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రైలు ఆలస్యంగా రావడం, స్కూలు బస్సు డ్రైవర్ అజాగ్రత్త కలసి చిన్నారుల జీవితాలను చిదిమేశాయి.