స్కూలు బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం!

 

మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో 26 మంది చిన్నారులు మరణించిన సంఘటన అందర్నీ కలచివేస్తోంది. అత్యంత విషాదకరమైన ఈ దుర్ఘటనకు కారణం స్కూలు బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును నడపడమేనని తెలుస్తోంది. డ్రైవర్ డ్యూటీకి ఆలస్యంగా రావడంతో పిల్లల్ని త్వరగా స్కూల్‌కి చేరవేయాలనే ఉద్దేశ్యంతో వేగంగా బస్సును నడిపించినట్టు తెలుస్తోంది. రైల్వేగేట్ వద్ద బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 26 మంది చిన్నారులు మరణించారు.ఈ ప్రమాదంలో స్కూలు బస్సు డ్రైవర్ కూడా మరణించాడు.