శశికళ జైలు నుండి ఎక్కడికి వెళుతుందో తెలుసా..?
posted on Aug 23, 2017 2:35PM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన దగ్గర నుండి ఆమె నెచ్చెలి అయిన శశికళపై ఏదో ఒక విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జయలలిత మృతికి శశికళే కారణం అంటూ మొదలైన ఆరోపణలు... ఆమె జైలుకు వెళ్లిన తరువాత కూడా ఆగలేదు. జైల్లో ఉన్నా కూడా ఆమెపై పలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇంతకు ముందే బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శశికళకు ప్రత్యేక వసతులు అందిస్తున్నారంటూ కర్ణాటక డీఐజీ డీ. రూపా పలు విమర్శలు గుప్పించగా... తాజాగా మరో బాంబు పేల్చారు. మొన్న ఆమె బయటకెళ్లి జైల్లోకి తిరిగి వస్తున్న వీడియోపై స్పందిచిన ఆమె.. శశికళ ఎక్కడికి వెళ్లాచ్చారో తెలుసా.. దగ్గరల్లో ఉన్న హోసూర్ ఎమ్మెల్యే ఇంటికి శశికళ వెళ్లొచ్చేవారని.. ఈ విషయం తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రూపా తన నివేదిక ద్వారా తెలిపింది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె రిలీజ్ చేసింది. శశికళకు ఎలాంటి ప్రత్యేక వసతులు కల్పించడం లేదని చెప్పి హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శిని జైలు అధికారులు తప్పుదోవ పట్టించారని రూపా ఆరోపించింది. ఇక జైల్లో మిగతా ఖైదీలంతా తెల్లటి వస్త్రాలే వేసుకుంటుండగా.. శశికళ, ఇళవరసి మాత్రం సివిల్ డ్రెస్సులు వేసుకుంటున్నారని..ఆమెకు రూమ్లో విలాసవంతమైన మంచం, పరుపు ఇచ్చారని నివేదికలో పేర్కొంది.