TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్యసభ బరిలో శరద్ పవార్

Published on: Thu Mar 5, 2026 8:06AM

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్  రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్  అఘాడీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని శరద్ పవార్ కుమార్తె,   ఎంపీ సుప్రియా సూలే స్వయంగా ప్రకటించారు.

శరద్ పవార్ అభ్యర్థిత్వానికి   కూటమి  భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయని పేర్కొన్నారు. శరద్ పవార్ ను బరిలో నింపడంపై తాను, జయంత్ పాటిల్  శివసేన (యూబీటీ) అధినేత  ఉద్ధవ్ థాకరేతో చర్చించినట్లు తెలిపిన సుప్రియాసూలే.. అలాగే  రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించామని చెప్పారు. శరద్ పవార్‌కు మద్దతు ప్రకటించినందుకు కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లకు  కృతజ్ఞతలు చెప్పారు. 

  కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు.   అయితే  ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.  మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రతిపక్ష కూటమిలోని శివసేన (యూబీటీ)కి 20, కాంగ్రెస్‌కు 16, ఎన్‌సీపీ (శరద్ పవార్) వర్గానికి 10 సీట్లు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే   రాజ్యసభ స్థానంలో గెలుపు లాంఛనమే.