ఢిల్లీలో కన్నాకి చేదుఅనుభవం
Published on: Thu Aug 23, 2012 9:40PM
మంత్రి కన్నా లక్ష్మీ నారాయణపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని వివరించేందుకు కన్నా.. అఖిలపక్షంతో కలిసి పవార్ దగ్గరికి వెళ్లినప్పుడు ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడమేనా అంటూ పవార్ కన్నాపై చిందులు తొక్కారు. మాట్లాడడానికి వచ్చినట్టు లేదని, యుద్ధానికి వచ్చినట్టుందని చీవాట్లు పెట్టారు. అందరిముందూ పవార్ అలా మండిపడేసరికి కన్నాకి నోటమాటరాలేదు. పవార్ సానుకూలంగా స్పందించకపోవడంతో చేసేదేంలేక అంతా కలిసి తోకముడుచుకొచ్చారు.


