శంకర్ రామన్ కేసు: కంచి స్వాములకు ఊరట

 

 

 

కంచి కామకోఠి పీఠాధిపతులకు తొమ్మిదేళ్లుగా వేధిస్తున్న కేసు నుంచి ఊరట లభించింది. శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వాములను నిర్దోషులుగా తేల్చుతూ బుధవారం ఉదయం పాండిచ్చేరి కోర్టు తీర్పును వెలువడించింది. జయేంధ్ర సరస్వతి, విజయేంధ్ర సరస్వతి సహా 23 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చనింది. ఈ కేసులో నిందితుల ప్రమేయంపై ఆధారాలు లేవని కోర్టు తెలిపింది.2004 సెప్టెంబరు నెలలో శంకరరామన్ హత్య జరిగింది. శంకరరామన్ హత్య కేసులో దర్యాఫ్తు బృందం 189 మందిని విచారించింది. ఈ కేసు విచారణ తమిళనాడులోని చెంగల్‌పేట కోర్టు నుండి పాండిచ్చేరి కోర్టుకు మార్చాలని జయేంద్ర సరస్వతి కోరారు. దీంతో సుప్రీం కోర్టు తీర్పుతో విచారణను పాండిచ్చేరి కోర్టుకు మార్చారు.