కేసీఆర్‌ని కలసిన సానియా.. రేపురామ్మా!

 

టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. అయితే కేసీఆర్ ఆమెను మంగళవారం నాడు మరోసారి కలవమన్నారని తెలిసింది. ఈ విషయాన్ని సానియా మిర్జా స్వయంగా తెలిపారు. తాను కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్ళానని, ఆయన తనను మంగళవారం నాడు మరోసారి కలవాల్సిందిగా సూచించారని ఆమె తెలిపారు. కాగా, సానియా మిర్జా తీను హైదరాబాద్‌లో నిర్వహిస్తు్న్న టెన్నిస్ అకాడమీకి సంబంధించిన పనుల నిమిత్తం కేసీఆర్ని కలిశారని పరిశీలకులు భావిస్తున్నారు.