న్యూస్ ఛానెల్స్ అతి.. సానియా మీర్జాకి తలనొప్పి

న్యూస్ ఛానెల్స్ వల్ల సెలబ్రిటీస్ కి ఎప్పుడూ తలనొప్పులు ఉంటూనే ఉంటాయి.. పర్సనల్ విషయాలు అందరికి చూపిస్తారు.. కొన్ని రూమర్స్ రియల్ న్యూస్ లా చెప్తారు.. చిన్న విషయాన్ని పెద్ద వివాదంలా చూపించి రచ్చ రచ్చ చేస్తారు.. అబ్బో ఇలా చాలా తలనొప్పులు ఉన్నాయి.. కానీ సానియా మీర్జా తలనొప్పికి కారణం ఇవి కాదులేండి.

 

 

సానియా మీర్జా చాలా కాలం తరువాత న్యూస్ ఛానెల్స్ చూశారట.. ఓ 12 మంది వ్యక్తులు కనిపించారట.. అందరూ గందరగోళంగా అరుస్తున్నారు తప్ప ఒక్కరు కూడా రిపోర్టింగ్‌గానీ, మాట్లాడటం గానీ చేయడం లేదట.. ఆ రచ్చ చూసి సానియా మీర్జాకి తలనొప్పి వచ్చిందట.. దీంతో మరో కొన్ని నెలలపాటు న్యూస్ ఛానెల్స్ చూసేది లేదని నిర్ణయించుకున్నారట.. ఈ విషయాన్ని స్వయంగా సానియా మీర్జా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. కొన్ని న్యూస్ ఛానెల్స్ ఈ విషయం మీద కూడా చర్చ పెట్టి రచ్చ చేస్తాయేమో చూడాలి మరి.