భారత ప్రతీకార దాడులు.. పాక్ రేంజర్లు మృతి

 

సరిహద్దుల్లో పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఇటీవల పాక్ జరిపిన కాల్పుల్లో పలువురు భారత సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికిగాను.. సరిహద్దుల్లో భారత ప్రతీకార దాడులు చేసింది. భారత జవాన్ల మృతితో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం కాల్పులు జరిపింది. సాంబ సెక్టార్ లో జరిపిన కాల్పుల్లో 12 మంది పాక్ రేంజర్లు మృతి చెందారు.