Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాలకొల్లులో ఆగష్టు 27న సమైక్యాంధ్ర రచయితల, గాయకుల సదస్సు
posted on: Aug 19, 2013 6:52PM

పాలకొల్లులో డా. సబితా జూనియర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ఆగష్టు 27 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు సమైక్యాంధ్ర రచయితల, గాయకుల సదస్సు APNRI, విశాలాంధ్ర మహాసభ వారిచే సంయుక్తంగా నిర్వహించబడుతుందని గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. సదస్సులో పాల్గొనేవారు ఉదయం 6:30కి పాలకొల్లు చేరుకోవాలని తెలిపారు.
ఈ సదస్సులో సమైక్యాంద్ర గీతాల రచన, గానములపై శ్రీ రసరాజు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, తటపర్తి రాజగోపబాలం, సిరాశ్రీ, డా. M.B.D.శ్యామల, ప్రముఖ సంగీత దర్శకులు పాల్గొంటారని వారి నేతృత్వంలో ఈ శిక్షణ శిభిరాలు నిర్వహించబడతాయని పాలకొల్లు సమైక్యాంధ్ర J.A.C కన్వీనర్లు మేడికొండ. శ్రీనివాస్ చౌదర, గండేటి వెంకటేశ్వరరావు,రావూరి.జవహర్ లాల్ నెహ్రు,K.A.J.N. వర్మ, విన్నకోట. వెంకటేశ్వరరావులు ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో కళాకారులు, గాయకులు, నటులు, వివిధ కళారూపాలకు చెందిన కళాకారులు, గేయ రచయితలు ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు.
పాలకొల్లు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వద్ద సమైకాంద్ర సదస్సు వాహానాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనదలచిన వారు శ్రీ మేడికొండ శ్రీనివాసచౌదరి గారిని cell:9848177511 నేరుగా సంప్రదింపవచ్చు. ఈ సదస్సులో పాల్గొనేవారికి సదస్సు నిర్వహించే రోజు వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు.






