సమైక్యాంద్ర కు మద్దత్తు గా డల్లాస్ ప్రవాసాంద్రుల ఉద్యమాలు !

 

 

 

మన రాష్ట్రము లో జరుగుతున్న సమైక్యాంద్ర మద్దత్తుగా ప్రవసాంద్రులు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు! స్థానిక జల్సా రెస్టారెంటు లో జరిగిన ప్రవాస ఆంధ్రుల ముఖ్య సమావేశం లో తెలుగు జాతిని విడగొట్ట వద్దూ అంటూ సమైక్యాంద్ర కోసం ఆంధ్ర ప్రదేశ్ లో పోరాడుతున్న ప్రజలకు మద్దత్తుగా ప్రవాసాంద్రులు "సమైక్యాంద్ర పరి రక్షణ సమితి" ని ఏర్పాటు చేసినారు .


సమైక్యాంద్రకు మద్దత్తుగా ప్రవాసాంద్రులు "సమైక్యాంద్ర  పరి రక్షణ సమితి " ఆద్వర్యములో  వివిధ రకాల ఉద్యమాలు చేయాలనీ ఈ సమావేశం లో నిర్ణ యించారు. 



ఈ నెల సెప్టెంబర్ 29 వతేదీ న దాదాపు 1500 మందితో పెద్ద ఎత్తున  సమైక్యాంద్ర వన భోజనాలు నిర్వహించి తెలంగాణా ,రాయల సీమ ,కోస్తాంద్ర  ప్రత్యెక వంటకాలతో  వంట వార్పూ నిర్వహించి తెలుగు జాతి అంతా ఒక్కటిగా వుండాలి అనే సందేశాన్ని చాటి చెపుతున్నాము  అన్నారు .వివిధ సాంసృతిక కార్యక్రమాలు నిర్వ హించ నున్నారు .

 సమైక్యాంద్ర వన భోజన కార్యక్రమానికి  కోఆర్డినేటర్  గా సుదీర్ చింతమనేని వ్యవహరిస్తారు .
-----------------------------------------------------------------------------------------------

అదేవిధముగా  తెలుగు జాతి ఐక్యత ,సమైక్యాంద్ర కోసం "ఫ్రవాసాంద్ర పాదయాత్ర " గాంధీ జయంతి రోజున నిర్వహిస్తున్నారు.

టెక్సాస్ రాష్ట్రములోని అన్ని ప్రాంతాల నుంచి  సమైక్యాంద్ర కు మద్దత్తుగా  హ్యూస్టన్ ఇండియన్ కాన్సులేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ను ఒక్కటిగానే ఉంచాలని విభజన ఆపాలి అంటూ మెమొరాండం ఇవ్వనున్నారు  .

ఈ సమావేశములో  Dr కొర్సపాటి  శ్రీధర్ రెడ్డి , వేణు పావులూరి ,ప్రతాప్ రెడ్డి , చంద్ర కాజ, లోకేష్ నాయుడు , అజయ్ గోవాడ, సుగన్ చాగర్లమూడి, కోడూరు కృష్ణా రెడ్డి , రమణా రెడ్డి,సుదీర్ చింతమనేని,  చిల్లకూరు గోపి,వెంకట శరణు,భావి రెడ్డి శ్రీనివాస్ , కిరణ్ తుమ్మల, ఎన్ ఎం ఎస్ రెడ్డి ,శివ బలుసు, వెంకట నారపల,శ్రీనివాస్ అడ్డా ఇతర ప్రవాసాంద్ర ప్రముఖులు  పాల్గొన్నారు.