సాక్షి గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాల కేసు 14వ తేదీకి వాయిదా
Published on: Fri May 11, 2012 8:53AM
వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో భాగంగా సిబిఐ సాక్షి మీడియాకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. బ్యాంకు ఖాతాలను సీబీఐ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసి పిటిషన్పై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం వాదోపవాదనలు ముగిశాయి. తుది తీర్పును ఈనెల 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.సరైన కారణం చూపకుండా ఖాతాలను నిలిపివేశారన్నారు. జగతి పబ్లికేషన్ అనేది వ్యక్తిగత సంస్థ కాదని, ఇందులో అనేక మంది షేర్హోల్డర్స్ ఉన్నారని కోర్టుకు వివరించారు. ఇందిరా టెలివిజన్పై ఎటువంటి ఆరోపణలు లేవని, అయినప్పటికీ బ్యాంకు ఖాతాలను నిలిపివేశారని కోర్టుకు తెలిపారు.


