సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. థాయ్‌లాండ్ ఓపెన్‌ 2021లో పాల్గొనడానికి బ్యాంకాక్‌ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. మంగళవారం నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు కరోనా పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో సైనా నెహ్వాల్ కు కరోనా పాజిట్ గా తేలింది. ఆమెతో పాటు మరో క్రీడాకారుడు హెచ్ఎస్ ప్రణయ్‌ కూడా కరోనా బారిన పడ్డారు. మరి కాసేపట్లో టోర్నీ ప్రారంభం కానుండగా భారత షట్లర్లకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. కాగా, ఈ నెల ఆరంభంలో సైనా నెహ్వాల్, శ్రీకాంత్, పీవీ సింధు మరియు సాయి ప్రణీత్ లతో పాటుగా టాప్ ఇండియా షట్లర్లు ఈ టోర్నీ కోసం థాయ్‌లాండ్‌ కు వెళ్లారు.