ఆ ఎమ్మెల్యేలను పాకిస్తాన్‌కు తీసుకెళ్లినా ఇబ్బందిలేదు..!

 

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా... కర్ణాటకలో అధికార పీఠం కోసం రాజకీయ పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ తమ నేతలను లాక్కొనకుండా ఉండేందుకు.. కర్ణాటక కాంగ్రెస్‌-జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరిలించిన సంగతి కూడా విదితమే. ఇక దీనిపై స్పందించిన బీజేపీ నేత సదానంద గౌడ వారిపై కామెంట్లు విసిరారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి కావాల్సిన మెజార్టీ ఉందని, లేకుంటే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌పై తరలించడంపై స్పందిస్తూ.. అది వారి హక్కు అని, వారందరిని ఎక్కడికి తీసుకెళ్లినా.. చివరకు పాకిస్తాన్‌కు తీసుకెళ్లిన తమకొచ్చిన ఇబ్బందేమి లేదన్నారు.