మంగళగిరిలో సచిన్‌ భూములు కొన్నాడా?

 

సచిన్ టెండూల్కర్‌ గుంటూరు జిల్లాలో వంద ఎకరాల భూమిని కొన్నట్టు మంగళగిరి పరిసరాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వర్గాలు భూముల ధరను పెంచడానికే ఈ ప్రచారం చేస్తున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి అవకాశాలు బాగా వున్నాయని తెలియడం వల్ల సచిన్ భూములు కొన్నాడని కొందరు అంటున్నారు. అయితే సచిన్ కొన్న భూములు ఎక్కడ వున్నాయి, సర్వే నంబర్ ఎంత, ఎప్పడు రిజిస్టర్ చేశారు, భూములు అమ్మినదెవరు అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పేవారెవరూ లేరు. మొత్తమ్మీద ఆ ప్రచారమంతా భూముల ధరలు పెంచడానికి రియల్ ఎస్టేట్ వర్గాలు వేసిన ఎత్తుగడ అని చాలామంది అంటున్నారు.