ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ గాడ్..

భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌‌కు రానున్నారు. తాను దత్తత తీసుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ‌లో ఆయన పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సచిన్ ఆ గ్రామానికి చేరుకుంటారు..అనంతరం 1.15 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత గ్రామస్థులతో స్వచ్ఛభారత్‌పై ముఖాముఖి నిర్వహించి, ఊరంతా పర్యటించి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులను పరిశీలించనున్నారు. తరువాత 1.60 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న గొల్లపల్లి, నెర్నూరు గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సచిన్ రాకను పురస్కరించుకుని గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.