పాకిస్తాన్ పై భారత్ గెలుస్తుంది : సచిన్
posted on Jan 3, 2013 8:37AM
పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ సెకండ్ మ్యాచ్ లో ఇండియా తిరిగి పుంజుకుంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భరోసా వ్యక్తం చేశాడు. తాను ఇప్పుడు జట్టులో లేను కాని, తన మనస్సు ఎప్పుడు జట్టుతోనే ఉంటుందని అన్నాడు. కోల్ కత్తా లో జరుగనున్న మ్యాచ్ లో భారత్ తిరిగి పుంజుకొని సిరీస్ సమం చేస్తుందని సచిన్ ధీమా వ్యక్తం చేశాడు.
తన 23 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో కుటుంబంతో ఎక్కువ కాలం గడిపే సమయం చిక్కలేదని, ఇక్కడ ఉంటే మన దేశం ఎంత అందమైన దో, ఈ చోటు ఎంత చక్కగా ఉందో తెలుస్తోందని సచిన్ వివరించాడు. తానిపుడు బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడడంతో పాటు టీవీలో క్రికెట్ చూస్తూ గడుపుతున్నానని ఈ దిగ్గజం చెప్పాడు.