TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇక రుషికొండ ప్యాలెస్ హోటల్ రంగానికి

Published on: Sun Jun 21, 2026 11:16AM

 

విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది. విశాఖలోని ఋషికొండ ప్రాంతంలో ఏపీ టూరిజం శాఖ పేరిట నిర్మించిన ఈ భవనాలను మంత్రులు పయ్యావుల కేశవులు, కందుల దుర్గేష్, బాల  వీరాంజనేయులు పరిశీలించారు. 

అక్కడ నాలుగు భవనాలు ఏ రకంగా నిర్మించారు అందులో ఏర్పాటు చేసిన సామాగ్రిని నిశితంగా పరిశీలించారు. ప్రధానంగా బాత్రూం.. బాత్ టబ్.. కమోడిటి లాంటి పరికరాలు ఎంత ఖరీదుగా ఏర్పాటు చేశారు. అన్న అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా దఫ దఫాలుగా ఈ భవనం నిర్మాణానికి నిధులు కేటాయించిన అంశాన్ని కూడా మంత్రులు పరిశీలించారు. రిసార్ట్స్ డెవలప్మెంట్ పేరిట ఈ భవనాలు నిర్మించారని ప్రతినెల నిర్వహణ కోసం దాదాపు 20 లక్షల ఖర్చు అవుతుందని మంత్రులు ప్రకటించారు. 

ఈ దేశంలో ఈ భవనాలను ఆతిథ్య రంగానికి పిపిపి పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించడంతోపాటు కొంత భాగాన్ని ప్రజల సందర్శనార్థానికి కేటాయిస్తున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఈ అంశాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్లడమే కాకుండా అనుభవం ఉన్న సంస్థలకు కేటాయించాలని ప్రతిపాదన కూడా ఇందులో చేయడం జరిగింది. త్వరలోనే దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకుంటామని కూడా మంత్రులు ప్రకటించారు..

జగన్ ప్రభుత్వం ప్రజలను మోసగించింది.. మంత్రి పయ్యావుల 

రుషికొండ భవనాల నిర్మాణం విషయంలో ప్రజలను అన్ని దశల్లో కూడా జగన్ ప్రభుత్వం మోసగించిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రధానంగా బాత్ టబ్  కుదాదాపు ఆరు లక్షలు ఖర్చు చేశారని... స్నానపు గదికి రెండు ఇళ్ల స్థలాన్ని వినియోగించారని విమర్శించారు. వాష్ రూమ్ కమోడిట్  నిధుల ద్వారా ఒక ఇంటిని నిర్మించవచ్చని మంత్రులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

విస్తీర్ణంలో కూడా 420 

రుషికొండ లోని ఏపీ టూరిజం భవనాన్ని లక్ష 35,420 చదరపు అడుగులు నిర్మించినట్టు మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది. ఇందులో కూడా 420 అక్షరాలు కనిపించాలని మంత్రులు పరోక్షంగా విమర్శలు చేశారు.