ఆర్టీసీ కదిలింది

 

RTC employees withdraw strike, RTC union withdraws strike, APSRTC strike

 

 

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని డిమాండ్ తో చేపట్టిన సమ్మెను సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులు విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవడంతో తిరిగి బస్ ల రాకపోకలు ఆరంభమయ్యాయి. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే ఖాన్ ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో చర్చలు ఫలించాయి. సమ్మెను విరమించుకుంటున్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరి వీరు సమ్మె చేసింది సమైక్య రాష్ట్రం కోరుతూనా?లేక వీరి డిమాండ్ల కోసమా?