Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుజరాత్లో 4వేల కోట్ల పల్లీల స్కామ్..!!
posted on: Aug 9, 2018 4:05PM

కాదేది స్కాముకి అనర్హం అని నేతలు ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటారు.. తాజాగా గుజరాత్ లో 4 వేల కోట్ల విలువైన పల్లీల స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది.. గుజరాత్లోని సౌరాష్ట్రలో వేరుశనగను ఎక్కువగా పండిస్తారు.. రైతుల వద్ద నుంచి ఈ పంటను నాఫెడ్, గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేకరించి గోడౌన్లలో ఉంచుతారు.. అయితే అధికారులతో కలిసి అధికార పార్టీ బీజేపీ నేతలు కొందరు.. రైతుల నుంచి సేకరించి గోడౌన్లలో దాచిన వాటిని రహస్యంగా మిల్లర్లకు అమ్మేశారు.. వాటి స్థానంలో ఇసుక, రాళ్లు పెట్టి ప్లాన్ ప్రకారం బుగ్గి చేయడం ప్రారంభించారు.. ఆరు నెలల్లో నాలుగు అగ్నిప్రమాదాలు జరిగి గోడౌన్లలోని సరుకంతా తగలబడిపోయినట్లు రాసుకున్నారు.. వరుసగా అగ్నిప్రమాదాలు జరగడంతో అనుమానమొచ్చి ఎంక్వయిరీ చేయగా ఈ స్కామ్ బయటపడింది.. ఈ స్కామ్ లో ఇప్పటికే 27 మంది అరెస్ట్ కాగా, వారిలో సుమారు 20 మంది బీజేపీ నేతలు ఉన్నారు.. నీతికి, నిజాయితీకి మారుపేరని చెప్పుకునే బీజేపీ నేతల స్కామ్ బయటపడటంతో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.


.jpg)



