లోకేశ్‌ పై రోజా కామెంట్...విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ...

 

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి లోకేశ్ పై విమర్సలు గుప్పించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో రోజా మాట్లాడుతూ..లోకేశ్‌ను రోజా విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ అంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు సూట్‌కేసు ఇస్తేనే పనులు జరుగుతాయని... ఓటేసిన ప్రజలు ఆయన వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వెళితే పనులు జరగవని, పనుల కోసం డబ్బు ఇస్తేనే ఆయన సంతకాలు పెడతారని అన్నారు. ఇంకా చంద్రబాబుపై కూడా ఆమె విమర్సలు గుప్పించారు. ఆనందనగరం సదస్సులు జరపడం సీఎం చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట... రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని, యువతకు జాబులు లేవని, రైతులు అప్పుల్లో మునిగిపోయారని రోజా అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని అన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారని చంద్రబాబు అనుకుంటే ఇప్పుడే ఎన్నికల్లోకి పదండని ఆమె సవాలు విసిరారు.