టీడీపీ మరణం.. చిరంజీవికి వర్మ కంగ్రాట్స్

 

ఏపీలో టీడీపీ ఓటమి ఖరారైంది. ఈ ఎన్నికల్లో టీడీపీని, చంద్రబాబుని వైసీపీ నేతలు ఎంతగా టార్గెట్ చేసారో.. వారికి రెట్టింపు రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేశారనే చెప్పాలి. ఇప్పుడు ఫలితాలు టీడీపీకి ప్రతికూలంగా ఉండడంతో.. వర్మ వరుస ట్వీట్లతో టీడీపీ, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా లగడపాటిని, పవన్ కళ్యాణ్ ని కూడా విమర్శించారు.

 

 

పంచర్ పడిన సైకిల్ టైర్ వైపు బాబు బాధగా చూస్తున్నట్లున్న ఫోటోని ముందుగా పోస్ట్ వర్మ.. వెంటనే టీడీపీ మరణించింది అంటూ మరో ట్వీట్ చేశారు. టీడీపీ మరణానికి కారణాలు.. అబద్దాలు, వెన్నుపోటు, అవినీతి, వైఎస్ జగన్, నారా లోకేష్ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

 

లగడపాటి రాజగోపాల్ కి సంబంధించిన ఓ పాత ఫోటోని వర్మ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో లగడపాటిని కొందరు మోసుకెళ్తున్నారు. ఫోటో పై "నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు సర్వేలు చేయనని" రాసుంది.

 

యాత్ర, ఎన్టీఆర్ బయోపిక్ ఫోటోలను పోస్ట్ చేసి.. సినిమా ఫలితమే, ఎన్నికల ఫలితం అయిందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

 

కేసీఆర్, చంద్రబాబుకి.. వైఎస్ జగన్ ఫోటోని రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నట్టుగా ఉన్న ఫోటోని వర్మ పోస్ట్ చేశారు.

"జనసేనతో పోల్చి చూస్తే ప్రజారాజ్యం బాహుబలి. కంగ్రాట్స్ చిరంజీవి గారు" అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తూ వర్మ ట్వీట్ చేశారు. మొత్తానికి వైసీపీ గెలుపుతో వర్మకి కిక్ ఎక్కినట్టుంది. వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.