ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంప ముంచిన గంటలకొద్దీ సమీక్షలు

 

అధికారులు.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాలి. కానీ చంద్రబాబు.. సమీక్షల పేరుతో అధికారులను గంటల కొద్దీ బందీ చేసి.. ప్రజలకు అందుబాటులో లేకుండా చేసారు. చివరకు ఈ ప్రభుత్వం అసలు ప్రజలకు అందుబాటులో లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించి ప్రజలకు దూరమయ్యారు. పాలన తీరు గురించి, ప్రజల బాగు గురించి సమీక్షలు నిర్వహించడం మంచిదే. కానీ అదే పనిగా సమీక్షలు చేస్తూ.. అధికారులను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయకూడదు. బాబు అమరావతిలో ఉంటే చాలు.. సమీక్షలు అంటూ, టెలీకాన్ఫెరెన్స్ లు అంటూ పొద్దున నుండి సాయంత్రం వరకు అధికారులను గదులకు పరిమితం చేసేవారు. దీంతో ఈ గంటల గంటలు సమీక్షలు ఏంట్రా బాబు అంటూ అటు అధికారుల్లో అసహనం పెరిగింది, అలాగే ఇటు ప్రజల్లోనూ అధికారులు అందుబాటులో లేకుండా పోయారన్న అసంతృప్తి వ్యక్తమైంది. ఇలా బాబు సమీక్షల చాదస్తం టీడీపీకి పెద్ద నష్టం చేసింది.