ఇంటర్ బోర్డు ఎదుట రేవంత్ రెడ్డి ధర్నా.. అరెస్ట్

 

ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. ఫలితాలు విడుదల తర్వాత.. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై విద్యార్థులు ఇంటర్ బోర్డు ఎదుట మూడురోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి మద్దతు తెలుపుతూ రేవంత్ రెడ్డి ధర్నా నిర్వహించారు.రేవంత్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, రేవంత్‌తో పాటు ధర్నాలో పాల్గొన్న నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బేగం బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.