రేవంత్రెడ్డి ఢిల్లీ టూర్!
Published on: Tue Oct 1, 2024 1:16PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ హస్తినకు వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన మల్లికార్జున్ ఖర్గేను పరామర్చించేందుకు రేవంత్ నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించిన తరువాత ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చిస్తారు. అలాగే టీపీసీసీ కార్యవర్గం పైనా చర్చించే అవకాశం ఉంది. హైడ్రా వివాదంపై కూడా రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ కు వివరించే అవకాశాలున్నాయి.


