సీఎం కేసీఆర్ పై డ్రంక్ & డ్రైవ్ కేసు పెట్టాలి

 

 

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కేసీఆర్ మీద ఘాటు విమర్శలు చేసారు.. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ & డ్రైవ్ కేసులు పెడుతున్న పోలీసులు.. ప్రగతి భవన్ లో పీకల దాకా తాగి ప్రభుత్వం నడుపుతున్న కేసీఆర్ మీద కూడా డ్రంక్ & డ్రైవ్ కేసు పెట్టాలంటూ విమర్శించారు.. అలానే 'ఇది ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ అని, అలాంటిది ఇప్పుడు ఉద్యమాలు చేస్తే కేసులు పెడుతున్నారంటూ' మండిపడ్డారు.. రైతులు బ్రతికున్నపుడు ఆదుకోకుండా చనిపోయాక ఐదు లక్షలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.