రేవంత్ మీద చార్జిషీట్

 

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద సునిశిత విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ దాఖలైన కేసులో బంజారాహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డి మీద చార్జిషీటు దాఖలు చేశారు. రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. పోలీసులు ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ముడుపులు తీసుకున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఒక న్యాయవాది దాఖలు చేసిన కేసు ఇప్పుడు చార్జిషీటుకి దారి తీసింది.