ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
Published on: Thu Feb 20, 2025 4:43PM
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైద్రాబాద్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. నల్లగొండ టూ టౌన్, బేగంబజర్ , కైడిపల్లి పోలీస్ స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల నిమిత్తమే రేవంత్ రెడ్డి కోర్టుకు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు.


