రేణుకాచౌదరికి అధిష్టానం షాక్‌

 

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ఫైర్‌బ్రాండ్‌ రేణుకాచౌదరికి కాంగ్రెస్‌ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి శుక్రవారం రేణుకాచౌదరిను తొలగించింది. అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పై రేణుకచౌదరితో పాటు జిల్లా నాయకులు కూడా షాక్‌ గురయ్యారు.

ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిథిగా రేణుకచౌదరి నియమితులయ్యారు. అయితే పార్టీ కార్యక్రమాలను భావాలను అనుకున్న స్థాయిలొ రేణుక ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెను అధికార ప్రతినిధి పదవినుంచి తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.