మోడీపై మరోసారి రేణకా చౌదరి విమర్శలు...

 

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో మోదీ చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆమె అన్నారు. తాను మహిళా ద్వేషిననే విషయాన్ని మోదీ నిరూపించుకున్నారని అన్నారు. రైతులు, దళితుల పట్ల కూడా మోదీ ద్వేష భావంతో వ్యవహరిస్తున్నారని రేణుక విమర్శించారు. తల్లిని కూల్యో నిలబెట్టి, దాన్నుంచి కూడా లాభం పొందాలనుకున్న వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు. మోదీ ఎన్ఆర్ఐ ప్రధాని అని... ఇక్కడ దేశంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఆయన స్పందించరని అన్నారు.